తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది..ఇప్పటికీ ఎన్నో వేదికల మీద ఎన్నో విషయాలు మాట్లాడిన సీనియర్ నటుడు బాలకృష్ణ నోటు నుంచి సరికొత్త విషయం తాజాగా బయటకు రావడం జరిగింది. తాజాగా తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన మాటలు అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికి ఎన్నో సినిమాలలో నటించిన బాలకృష్ణ దానిద్వారా కోట్ల మంది అభిమానులకు దగ్గరయ్యారు. బాల నటుడిగా మొదట బాలకృష్ణ అని గుర్తించింది ఎవరు అన్న ప్రశ్నకి.. అందరూ కూడా తన తండ్రి నందమూరి తారకరామారావు అని చెబుతూ ఉంటారు.


కానీ ఆ సమాధానం తప్పని.. ఎందుచేత అంటే తనలోని నటనను మొదటిసారిగా గుర్తించిన వ్యక్తి ఆ విషయాన్ని తన తండ్రి ఎన్టీఆర్ కు చెప్పినట్లుగా సమాధానాన్ని తెలియజేశారు. తనకు సినారె జీవిత సాఫల్య స్వర్ణ కనకాన్ని. అందించిన వ్యక్తి తనలోని నటుడు గుర్తించిన వ్యక్తి సి నారాయణ రెడ్డి అని తెలియజేశారు. ఎన్టీఆర్ కు ఉన్న మంచి స్నేహితులలో సినారె కూడా ఒకరట. ఆయన మా కుటుంబంలోని ఒక వ్యక్తి అంటూ ఆయనకు సంబంధించిన విషయాలను గుర్తు చేశారు బాలకృష్ణ.


నటనకు కొత్త భాష్యం చెప్పినా.. పారాణిక పాత్రలలో తనని నటింపజేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు కు ఉన్న గుర్తింపు, గౌరవం అభిమానులలో ప్రజలలో ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు బాలకృష్ణ అలాంటి మహానటుడి నట వారసుడుగా గుర్తింపు తెచ్చుకోవడం తనకి చాలా గర్వకారణంగా ఉంది అని. బాల నటుడుగా ఆయన కాకుండా మరొకరు గుర్తించడం ఆసక్తికరంగా ఉందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది ఏ సినిమా రాయలసీమ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కించడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: