మెగా కుటుంబం నుంచి అల్లు శిరీష్ హీరో గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతొంది. అయితే ఇప్పటివరకు ఒక సినిమా హిట్టు కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు. దీంతో ఈ హీరో సినిమాలు వదిలేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ హీరో కోసం జాతి రత్నాల డైరెక్టర్ ఫెమ్ అనుదీప్ ఇతనితో ఒక సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం అంతేకాకుండా ఈ సినిమాకి నిర్మాతగా కూడా అల్లు అరవింద్ వ్యవహరించడం గమనార్హం. అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.


ఇకపోతే ఇదివరకే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ శిష్యుడు అయినటువంటి వంశీతో చిట్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక వారితో అల్లు అరవింద్ సైతం ఎంతో జోవియల్ గా సంభాషించడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెత్తిన వైరల్ గా మారుతుంది. అయితే వారిద్దరి కోసం అల్లు అరవింద్ అంత సమయాన్ని కేటాయించడం అన్నది ఇక్కడ గొప్పగా గమనించాల్సిన విషయం. వాళ్లతో పాటు ఎంతోమందితో సరదాగా గడిపారు విషయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సిరీస్ ఏ బి సి డి తర్వాత ఇక ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇక ప్రేమ కాదంట అనే సినిమా ప్రకటించినప్పటికీ ఈ చిత్రం గురించి మళ్ళీ ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు.. అయితే ఇప్పుడు తాజాలు ఈ చిట్ చాట్ నేపథ్యంలో అనుదీప్ వంశీలకు శిరీష్ తో సినిమా చేసే అవకాశాన్ని అరవింద్ ఇచ్చి ఉండొచ్చు అనే విషయం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అనుదీప్ ఇప్పటికే చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందాడు. ప్రస్తుతం శివ కార్తికేయంతో తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక జాతి రత్నాల సక్సెస్ వెనుక అనుదీప్ శిష్యుడు వంశీ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ సినిమా కోసం పనిచేసిన ఆశ్చర్యం లేదంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. మరి వీరిద్దరితోనైనా అల్లు శిరీష్ కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: