టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జయం మూవీ తో  కెరీర్ ని మొదలు పెట్టిన నితిన్ ఆ తర్వాత సై మూవీ తో అదిరిపోయే విజయాన్ని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వరుస పరాజయాలను ఎదుర్కొన్న నితిన్ 'ఇష్క్' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి , ఆ తర్వాత అనేక విషయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో క్యాథరీన్ , కృతి శెట్టి హీరోయిన్ లుగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం  హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు , పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో సినీ ప్రేమికులు ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఫ్లై హై మరియు సథరన్ స్టార్ల్నెట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించగా , సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ తో నితిన్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: