టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో వెండితెరకు పరిచయం అయిన నిఖిల్ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు.

నిఖిల్ కెరీర్ లో మంచి విజయవంతమైన సినిమాలలో కార్తికేయ సినిమా కూడా ఒకటి. నిఖిల్ కెరియర్ లో కార్తికేయ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలా సినిమా కార్తికేయ మూవీ మంచి విజయం సాధించడంతో కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ తాజాగా హీరోగా నటించాడు. ఈ సినిమాకు కార్తికేయ సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ , నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మొదట జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్ట్ 12 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అసలు విషయం లోకి వెళితే ...  జులై 22 వ తేదీన సినిమాను రిలీజ్ చేద్దాం అని అనుకుంటే , ఆగస్ట్ 12 వ తేదీకి పోస్ట్ ఫోన్ చేయించారు. ఇప్పుడు ఆగస్ట్ 12 వ తేదీన తేదీ కి థియేటర్ లు ఉండవు అక్టోబర్ లో విడుదల చేసుకోండి అన్నారు.  అప్పుడే జీవితంలో మొదటి సారి ఏడ్చాను. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు మూవీ రిలీజ్ చేసుకోవాలంటే చాలా కష్టం అని నిఖిల్ తాజా ఇంటర్వ్యూ ఇచ్చాడు. నిఖిల్ తాజాగా తీసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: