అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి తాజాగా హ్యాపీ బర్త్ డే అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వెన్నెల కిషోర్ ,  సత్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి మత్తు వదలరా మూవీ తో దర్శకుడిగా ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్న రితీశ్ రానా దర్శకత్వం వహించాడు.

మత్తు వదలరా లాంటి విజయవంతమైన మూవీ తర్వాత రితీశ్ రానా దర్శకత్వం వహించిన సినిమా కావడం, అలాగే ఈ సినిమా విడుదల కి ముందు ఈ మూవీ యూనిట్ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లు , టీజర్ , ట్రైలర్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ జూలై 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన మత్తు వదలరా సినిమా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇలా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. లావణ్య త్రిపాటి ప్రధాన పాత్రలో వెన్నెల , కిషోర్ , సత్య ఇతర పాత్రలలో నటించిన హ్యాపీ బర్త్ డే సినిమా ప్రముఖ 'ఓ టి టి' సంస్థల్లో ఒకటి అయిన్స్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఆగస్ట్ 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: