షూటింగ్ నుంచి కాస్త విరామం లభించినా చాలు మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లిపోతుంటారు. ఫ్యామిలీతో గడిపేందుకు దొరికే ఏ ఒక్క చాన్స్ ను కూడా మహేష్ అస్సలు వదలరు.


ఇటీవల ' సర్కారు వారి పాట' బ్లాక్ బస్టర్ విజయం అనంతరం.. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ కు వెళ్ళొచ్చారు. అక్కడ ఫ్యామిలీతో మహేష్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఇన్ స్టాలో మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ స్విట్జర్లాండ్‏లో దిగిన ఒక రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశారట..

మహేష్ తనను కౌగిలించుకొని ముద్దాడుతున్న ఫోటో అది. 'సెయింట్ మోరిట్జ్ ఇట్ ఈజ్.. మీతో ఎవరిని పోల్చలేను. సరిలేరు మీకెవ్వరూ ' అంటూ ఆ ఫోటోతో పాటు నమ్రత కామెంట్ పెట్టారు. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. క్యూట్ కపూల్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.



మహేష్ కంటే కూడా హౌస్ వైఫ్ గా నమ్రతనే పొగడాలి అచ్చ తెలుగు ఆడపిల్లలు, హీరోయిన్స్ కూడా పెళ్ళైతే ఏమి మా కెరీర్ మాదే అంటున్నారు. ముంబై కి చెందిన అల్ట్రా మోడ్రన్ మోడల్ మిస్ ఇండియా నమ్రత మాత్రం పెళ్ళైన వెంటనే మహేష్ మాత్రమే జీవితంగా గడుపుతున్నారు. తన కలలు, కెరీర్ పూర్తిగా పక్కన పెట్టి పూర్తి హౌస్ వైఫ్ గా ఆమె మారిపోయారు. ఇద్దరు పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం వంటి బాధ్యతలు నమ్రత సమర్ధవంతంగా నిర్వర్తించారు. పిల్లలు పెద్దయ్యాక నమ్రత మహేష్ మేనేజర్ గా వ్యహరిస్తున్నారు. ఆయన బిజినెస్ లు , ఎండార్స్మెంట్స్ , డేట్స్ ను చూసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుందట.. మహేష్ 28వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా… ఆగస్టు లో షూటింగ్ మొదలు కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

మహేష్, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్స్ చిత్రాలు వచ్చాయి. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయట .

మరింత సమాచారం తెలుసుకోండి: