స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి నిన్న  ఆగస్టు ఒకటి 2022 మధ్యాహ్నం సమయంలో తన ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.అయితే ముఖ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త సామాన్యుల తో పాటు పలువురు ప్రముఖులను కూడా కలవరపాటుకు గురిచేస్తోందని చెప్పవచ్చు.పోతే ఉస్మానియా ఆసుపత్రి మార్చరీలో ఉమామహేశ్వరి పార్తివదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.కాగా  ఇక ఆమె ఉరివేసుకోవడం వల్లే మరణించినట్లు ప్రాథమికంగా వైద్యులు తెలిపారు.

ఇకపోతే సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత తన తల్లి తలుపులను బలవంతంగా తెలిసి చూడగా ఆమె చున్నికి వేలాడుతున్నారు అని దీక్షిత తెలిపారు.  అనంతరం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు లకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు.ఇదిలావుంటే ఇక దీక్షిత మాట్లాడుతూ తన తల్లి కొంతకాలంగా అనారోగ్య సమస్యతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని..అంతేకాదు  రోజులాగే గదిలోకి వెళ్లి నిద్రపోతున్నారని అనుకున్నాము అని తెలిసింది. ఇక దీక్షిత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

ఇకపోతే  ఉమామహేశ్వరి భర్త శ్రీనివాస ప్రసాద్ కూడా వ్యాపార లావాదేవీల నిమిత్తం గత మూడు రోజుల నుంచి ఇంట్లో లేరు.. అయితే ఇక నిన్న మూడు గంటల సమయంలో నివాసానికి చేరుకున్నారు. పోతే ఉమామహేశ్వరి భౌతిక కాయానికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఎంబామింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే ఇక ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉండడం వల్ల రావడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆమె భౌతికకాయానికి ఎంబామింగ్ నిర్వహించారు.ఇదిలావుంటే మరోవైపు ఉమామహేశ్వరి చాలా మంచివారని , ఎవరిని కూడా ఒక మాట కూడా అనేవారు కాదని , చాలా మృధు స్వభావి అని అక్కడ పనివాళ్ళు, బంధువులు చెబుతున్నారు. ఇకపోతే  ఆమె కోరిక మేరకు ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేయడం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: