ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు మంచు విష్ణు.అయితే  ఈయన కెరీర్ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనారెడి’ వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఇకపోతే ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపోయినా పెట్టిన బడ్జెట్ వచ్చేది. క్రమంగా ఈయన సినిమాలు ఓకే విధంగా ఉండటం..ఇక  కొత్తగా ప్రయత్నించకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేది. అయితే దాంతో థియేటర్లలో ఈయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం తగ్గించారు.

ఇదిలావుంటే  ఈయన నటించిన గత ఐదారు సినిమాలు కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఇక.ప్రస్తుతం ఈయన ‘జిన్నా’ అనే విభిన్న కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ముస్తాబయ్యాడు. పోతే ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇదిలావుంటే  ఇటీవలే చిత్రం నుండి విడులైన టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.అంతేకాదు  తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇక ఈ చిత్రం ఆక్టోబర్ 5న విడుదల కానున్నట్లు విష్ణు తన సోషల్ మీడియాలో  పేర్కొన్నాడు.

అయితే ఇక  అదే రోజున చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు విడుదల కానున్నాయి. పోతే ఈ రెండు సినిమాలకు విపరీతమైన బజ్ ఉంది. కాగా ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎలాంటి బజ్ లేదు.అయితే  మరీ ఈ ఇద్దరు సీనియర్‌ హీరోల పోటీని తట్టుకుని విష్ణు దసరా విన్నర్‌గా నిలుస్తాడా? లేదా ?అనేది చూడాలి.ఇదిలావుండగా ఈ చిత్రంలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు.ఇక  సన్నిలియోన్, రాజ్‌పుత్ పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. పోతే అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వర పరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: