దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా, సుమంత్, భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతుంది.

సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ మూవీ ఈ బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమా గురించి అనేక విషయాలను తెలియజేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాళిని ఠాకూర్ మాట్లాడుతూ ... కుంకుమ భాగ్య అనే సీరియల్ ద్వారా నేను చాలా మందికి తెలిశాను. కుంకుమ భాగ్య సీరియల్ నాకు మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది. తెలుగు నుంచి  ఇంత మంచి సినిమాలో అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. అందులోనూ టైటిల్ తో ముడిపడిన  పాత్రలో అవకాశం వస్తుందని ఊహించలేదు.   దుల్కర్ సల్మాన్ వంటి గొప్ప నటుడి కి జోడీగా తెరపై కనిపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

అలాగే మృణాళిని ఠాకూర్ ,  రష్మిక మందన గురించి మాట్లాడుతూ ... రష్మిక మందన చాలా యాక్టివ్ గా ఉంటుంది. బొంబాయి , చెన్నై , బెంగళూర్ ,  ఫారిన్ ఇలా ఆమె విమానాల్లో ఎక్కుతూ,  దిగుతూ,  ప్రయాణాలు చేస్తూ సినిమా షూటింగ్ లో పాల్గొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగేది. రష్మిక మందన తన విషయంలో ఎంత కేర్ తీసుకుంటుందో,  తన పక్కన వారి విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటుంది అని తాజా ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: