టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పక్కన నటించేందుకు చాలా మంది హీరోయిన్లు కూడా బాగా పోటీపడుతుంటారు.ఎందుకంటే ఆయన క్రేజ్ అలాంటిది. ఆయనతో ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటిస్తే చాలు ఆ హీరోయిన్ లైఫ్ సెట్ అయిపోయిద్దు. వరుస అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి. ఇక దానికి ఉదాహరణ రష్మిక మందన్న.. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ తో నటించి క్రేజ్ సంపాదించుకొని ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఇక ఈ విషయం పక్కన పెడితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమాలో ఇప్పటికే పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. ఇక హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి లొకేషన్లు ఇంకా సెట్‌పై ఎలా వెళ్ళాలో చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.అయితే కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం ఏర్పడింది.అందుకే ఇందులో శ్రీలీల మరో నాయికగా నటించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.


అయితే ఈ మేరకు మలయాళ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపిక చేస్తున్నారని తెలిసింది.ఇక ఇప్పటికే ఈమె నానితో గ్యాంగ్ లీడర్`లో నటించింది. తమిళంలో వ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన `డాక్టర్`, `డాన్ చిత్రాల్లో కూడా నటించింది.ఇందులో ఆమె పాత్ర తక్కువైన పెద్ద బేనర్ పైగా సూపర్ స్టార్ హీరో సినిమా కనుక అంగీకరించిందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించింది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా అసలు ఆమెను సంప్రదించలేదని తెలిపింది. ఒకవేళ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానని తెలిపినట్లు సమాచారం తెలుస్తుంది. దీన్ని బట్టి ప్రియాంక మోహన్ ఈ సినిమాలో నటించట్లేదని తెలుస్తుంది. ఇక త్వరలో ఈ సినిమా సెట్‌పైకి వెళ్ళనుంది. ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలో ట్యూన్స్ కార్యక్రమాలు కూడా చెన్నైలో జరుగుతున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: