టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఉప్పెన తోనే వంద కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టి  హీరోగా తన స్టామినాను మొట్ట మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర నిరూపించుకున్నాడు. అలా ఉప్పెన మూవీ తో తన స్టామినాను బాక్సాఫీస్  దగ్గర నిరూపించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత కొండపొలం అనే వైవిధ్యమైన మూవీ లో హీరోగా నటించాడు. 

సినిమా బాక్సా ఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని అందుకోలేక పోయింది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ యువ హీరో తన రెండో సినిమాతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

 ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ నుండి 'సిరి సిరి మువ్వలోన' అనే సాంగ్ ని విడుదల చేసింది. ఈ సాంగ్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 2.5 మిలియన్ వ్యూస్ ని దక్కించుకొని ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  మరి కొండపొలం సినిమాతో ప్రేక్షకులను వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: