తెలుగు ఇండస్ట్రీలో హీరోగా  గుర్తింపు తెచ్చుకున్న నటలలో తొట్టెంపూడి వేణు కూడా ఒకరు. హీరోగా తన కెరియర్ ప్రారంభించి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతుంది తనదైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వేణుకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. స్వయంవరం సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వేణు ఆ తర్వాత హీరోగా వరుస విషయాలను అందుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.


అలా నటిస్తూ నటిస్తూ అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు తాజాగా రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రియంట్రి ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్లలో తొట్టెంపూడి వేణు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబుతో తనకున్న విభేదాలపై స్పందించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.


తొట్టెంపూడి వేణు మాట్లాడుతూ... చిన్న సంఘటన జరిగింది దాన్ని పెద్దదిగా చేయడం తనకు ఇష్టం లేదని కూడా తెలియజేశారు. దీనివల్ల ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాను.. ఆ రోజుల్లో నాకు అది పెద్ద అమౌంట్ ఆయన మధ్యలో ఎంటర్ అయ్యి వేరే వ్యక్తికి పూచి ఆయన పూచి ఉండడం జరిగింది. పర్సనల్ గ్యారెంటీ కూడా ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా తన దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి సరిగ్గా డబ్బులను తిరిగి ఇవ్వలేదు.. ఇక ఆ తర్వాత ఆ విషయంపై జగపతిబాబు తనకు ఎప్పుడూ కూడా ఈ విషయంపై మాట్లాడలేదని తెలిపారు. ఇక దీంతో నేను కూడా ఆ విషయాన్ని వదిలేశాను. అలా  మొత్తం  మిద రూ.12 లక్షలు పోగొట్టుకున్నానని తెలియజేశారు. ప్రస్తుతం వేణు చేసిన ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై జగపతిబాబు క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: