నేషనల్ క్రష్ రష్మీక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రష్మిక మందన కన్నడ , తెలుగు , తమిళ భాషల సినిమాలలో నటించి అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పుష్ప సినిమాతో రష్మిక మందన పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అలాగే మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే పుష్ప పార్ట్ 2 మూవీ లో కూడా రష్మిక మందన నటించబోతోంది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ మూవీ తో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తళపతి విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న వరిసు (వారసుడు) మూవీ లో  తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీక మందన కు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా రష్మిక మందన ముంబై లోని నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్ ఆఫీస్ నుండి బయటకు వస్తూ బ్లాక్ ఫార్మల్ పాంట్స్ వైట్ కలర్ స్వేట్టర్ ను ధరించి కనిపించింది. ఈ డ్రెస్ లో రష్మిక మందన అదిరిపోయే రేంజ్ లో ఉంది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన వేసుకున్న ఈ డ్రెస్ ఖరీదు 1,26,440 రూపాయల విలువైందని తెలుస్తోంది. దాని పేరు గూచీ స్వేట్టర్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: