టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమా పరిశ్రమ మధ్య కనిపించని యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు. సినిమాల పరంగా ఇప్పటికే టాలీవుడ్ సినిమా పరిశ్రమ పై పై చేయి సాధించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుంటే బాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోతున్నాయి.  విధంగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇప్పుడు తప్పనిసరిగా ఓ భారీ విజయం అవసరమైన నేపథ్యంలో వారు ఏ సినిమా బాలీవుడ్ పరువును కాపాడుతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

తాజాగా మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు బాలీవుడ్ లో తమ జోరుని చూపిస్తున్నారు. అక్కడ తమదైన మార్క్ చూపిస్తూ బాలీవుడ్ స్టార్స్ ను కిందకు తొక్కేస్తున్నారు. ఆ విధంగా కరణ్ జోహార్ హోస్ట్ గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న ఇద్దరు సౌత్ స్టార్స్ ఇప్పుడు నార్త్ స్టార్స్ ఎపిసోడ్స్ ను మించిన రేటింగ్స్ అందుకోవడం విశేషం. ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో యొక్క ఏడవ సీజన్ తాజాగా మొదలైంది. హాట్ స్టార్ లో దీని యొక్క స్ట్రీమింగ్ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలే అతిథులుగా పాల్గొంటూ వచ్చారు. మధ్యలో కొంతమంది సందడి చేసినా కూడా ఈ సీజన్లో సమంత మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా కనిపించారు.

ఎక్కువ శాతం ముంబై సెలబ్రిటీలకే ప్రాధాన్యత ఇచ్చే ఈ షో లో సౌత్ ఫేమస్ అయిన ఈ ఇద్దరినీ తీసుకురావడం అందరిలో ఎంతో ఆసక్తిని ప్రయత్నించింది. అయితే ఇప్పటివరకు చేసిన షోలలో వీరిద్దరూ వచ్చిన ఎపిసోడ్ లు ఎంతో హైలైట్ అయింది అని చెప్పవచ్చు. వ్యక్తిగత విషయాలను నిరభ్యంతరంగా అడుగుతూ వచ్చిన హోస్ట్ గెస్ట్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వారు చెప్పగలిగే ప్రశ్నలను సంధిస్తూ ఎంతో బాగా ఈ షోను రన్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి పోను పోను ఆయన ఈ షో ను ఇంకా ఎంత మనోరంజకంగా రూపొందిస్తాడో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: