సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సర్కారు వారి పాట మూవీతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

సినిమా మహేష్ బాబు కెరీర్ లో 28 వ సినిమా. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల నుండి ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు కూడా మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ కి మది కెమెరామెన్ గా పని చేయనున్నాడు. అలాగే ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు ఆయన ఉపేంద్ర , అలాగే తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఉపేంద్ర పాజిటివ్ పాత్రలో నటించనుండగా ,  విజయ్ సేతుపతి నెగటివ్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఇది వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: