టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూడో సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డేను ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ సినిమా కథ కోసం మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్‌ను బరిలోకి దింపబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో పాటు ఇంకా తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించనున్నాడట.


ఇప్పటికే వీరిద్దరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను కూడా వినిపించాడని టాక్. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర చేయబోయేది ఓ కీలక పాత్ర అని అంతేగాక అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.ఇంకా అటు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేయబోతున్నాడట. గతంలో ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో బాగా మెప్పించిన విజయ్ సేతుపతి, ఇక ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీలో తన పర్ఫార్మెన్స్‌తో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీలో ఈ యాక్టర్ ఎలాంటి రోల్ చేస్తాడా.. ఆయన ఈ సినిమాలో మహేష్ బాబును ఎలా ఢీకొడతాడు అనేది మహేష్ అభిమానుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సూపర్ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: