టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఆఖరుగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తో తన అభిమానులను నిరుత్సాహపరిచిన విజయ్ దేవరకొండ తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా, పూరి కనెక్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లలో ఈ మూవీ ని పూరిజగన్నాథ్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించగా, రమ్యకృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తో పాటు మలయాళ , హిందీ , కన్నడ , తమిళ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మూవీ కి సెన్సార్ బోర్డ్ నుండి యూ / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ ని కూడా మూవీ యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు,  ఈ మూవీ లో ఫస్టాఫ్ ఒక 1 :15 నిమిషాలు గాను,  సెకండాఫ్ 1:05 నిమిషాలు గాను ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా లైగర్ మూవీ మీడియం రేంజ్ నిడివితోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: