ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విడుదల కు సిద్ధంగా ఉన్నా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ లలో లైగర్ మూవీ ఒకటి. లైగర్ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేమూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా, మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని పూరి కనెక్స్ ,  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లలో పూరి జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూ వీని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆగస్ట్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకులనుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను సరిగమ సినిమాస్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీ కోసం అదిరిపోయే రేంజ్ లో బాడీ బిల్డ్ చేశాడు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఏ రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: