టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న శృతి హాసన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరీర్ ప్రారంభం లో బాక్సా ఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్న శ్రుతి హాసన్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది .

ఆ తర్వాత వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన శృతి హాసన్ అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది . ప్రస్తుతం కూడా శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది . ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు లో మూడు మూవీ లలో  హీరోయిన్ గా నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన జోష్ ని ఫుల్ గా చూపిస్తుంది. ప్రస్తుతం శృతి హసన్ ,  రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ఒక సినిమా హీరోయిన్ గా నటిస్తోంది. 

అలాగే నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన ఒక సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శృతి హాసన్ తన ఎదుగుదలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీ లో తాను సొంతగా పైకి వచ్చాను అని, ఇండస్ట్రీ లో అవకాశాల కోసం అమ్మా నాన్న ఎవరికీ కూడా ఫోన్ చేయలేదు మరియు ఎవరికి రికమెండ్ చేయలేదు అని శృతి హాసన్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: