టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయిన రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది .

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప మూవీ తో రష్మిక మందన ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించు కొని , ప్రస్తుతం బాలీవుడ్ మూవీ లలో కూడా నటిస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన సీతా రామం అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాలిని ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.  ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తోంది.

ఇలా సీతా రామం మూవీ మంచి విజయం సాధించడంపై తాజాగా రష్మిక మందన స్పందించింది.  సీతా రామం మూవీ విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని , ఈ మూవీ కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డారు.  క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది అని రష్మిక మందన పేర్కొంది. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ ల పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: