ప్రభాస్ ఫ్రెండ్ వంశీకృష్ణారెడ్డి అలాగే సోదరుడు ప్రమోద్ ఉప్పలపాటి మరో స్నేహితుడితో కలిసి ప్రారంభించిన యువి క్రియేషన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగులో రన్ రాజా రన్, మిర్చి ఇంకా రాధేశ్యామ్ లాంటి అనేక సినిమాలను నిర్మించిన ఈ సంస్థ ప్రభాస్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాల్లో కూడా భాగస్వామ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.ప్రభాస్ చేస్తున్న చాలా సినిమాలలో సహనిర్మాణం చేస్తూ ఉంటుంది. అయితే డార్లింగ్ ప్రభాస్ ఇప్పటికే ఈ బ్యానర్ లో మూడు సినిమాలు చేశారు. ఆ మూడింటిలో కేవలం మిర్చి సినిమా ఒకటి సూపర్ హిట్ కాగా రాధేశ్యామ్ అలాగే సాహో సినిమాలు డిజాస్టర్ ఫలితాలను ఇచ్చాయి. అంతేకాక ప్రభాస్ గనుక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేస్తే సినిమా అనుకున్న టైంకి అసలు విడుదల కాదని ఆయన అభిమానులు కోప్పడుతా ఉంటారు.ఇక సొంత బ్యానర్ కావడంతో ప్రభాస్ అలక్ష్యం వహిస్తాడో లేక నిర్మాతలే లైట్ తీసుకుంటారో తెలియదు కానీ అప్డేట్స్ విడుదల చేయడం మొదలు అన్ని విషయాల్లో కూడా చాలా లేట్ గా ఉంటుందని ఆయన అభిమానుల భావిస్తూ ఉంటారు.


అందుకే ఆయన యూవీ క్రియేషన్స్ లో సినిమాలు చేయకపోతేనే చాలా బాగుండు అని వారంతా కూడా భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభాస్ వారికి మరో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం తెలుస్తోంది. ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం తెలుస్తోంది.అయితే ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. గతంలో మారుతి సినిమా యువీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశం కూడా ఉందని ప్రచారం జరిగింది. బహుశా ఆ సినిమానే ఈ బ్యానర్లో చేస్తారా లేక అది కాకుండా మరో సినిమాకి గ్రీన్ సెగ్నల్ ఇచ్చారా అనే విషయం మీద క్లారిటీ ఇంకా లేదు. అయితే ప్రభాస్ మళ్ళీ మూవీ కోసం ఈ బ్యానర్లో సినిమా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ప్రభాస్ సినిమా యువి క్రియేషన్స్ లో చేయకుండా ఉంటే బాగుండని వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: