తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ లో జన్మించిన తేజస్విని మడివాడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హార్ట్ ఎటాక్ తదితర సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించింది . అయినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. ఇక అలాంటి సమయంలోనే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దృష్టిలో పడడంతో వర్మ డైరెక్షన్లో ఐస్ క్రీమ్ అనే సినిమాలు నటించింది. ఇక వర్మ క్రియేటివిటీతో ఆమె పర్ఫామెన్స్ తో ఈ సినిమా తనదైన శైలిలో మార్పును అందుకుంది.



ఇక తర్వాత కొన్నాళ్లపాటు వరుసగా సపోర్టింగ్ రోల్స్ లో నటించిన కానీ ఆ తర్వాత తెలుగు తెరపైకి మాత్రం గుర్తింపు తెచ్చుకోలేక పోయింది ఇక ఈ క్రమంలోనే చాలా కాలం పాటు గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. ఇక ఎలాంటి అవకాశాలు లేక ఖాళీగానే ఉన్నదట తేజస్విని ఇక ఈ క్రమంలోని బిగ్ బాస్ లో అవకాశం వచ్చి వెళ్లడంతో మరింత పాపులర్ అయింది తాజాగా తేజస్విని నటించిన కమిట్మెంట్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె వృత్తిపరంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.


కమిట్మెంట్ వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమని కథ విన్నప్పుడు తనకు ఎదురైన కొన్ని సంఘటనలను సినిమాలో ఉన్నట్లుగా అనిపించింది అని అందుచేతనే ఆమె ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారని తెలిపింది. నాలుగు కథలతో తెరకెక్కిస్తున్న ఈ కమిట్మెంట్ సినిమా నాదొక సహజమైన కథ పాత్ర కావడంతో ఈ సినిమాలో నేను అనుకున్నంత విజయం చేకూరుతుందని నమ్మకం ఉందని తెలిపింది. సినిమా అని ఒక మోజులో తను చాలా కోల్పోయినట్లుగా  తెలియజేసింది. ఇంట్లో పెళ్లి చేసుకోమన్న చేసుకోవడం లేదట ఒకవేళ వివాహం చేసుకుంటే మాత్రం వెంటనే సినిమాలు వదిలేయాలని కుటుంబ సభ్యులు కండిషన్ పెట్టారు దీంతో తన మనసులో నుంచి పెళ్లి అని ఆలోచన తొలగించిందట అందుచేతనే ఇంతవరకు వివాహం చేసుకోలేదని.

మరింత సమాచారం తెలుసుకోండి: