డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఖరుగా రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది . ఈస్మార్ట్ శంకర్ లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తాజాగా లైగర్ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది . పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ లు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. లైగర్ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన తెలుగు తో పాటు హిందీ , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా టైగర్ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ... విజయ్ దేవరకొండ లో తనకు నిజాయితీ బాగా నచ్చింది అని చెప్పు కొచ్చాడు. అలాగే తన నిజాయితీ మాటల్లో మాత్రమే కాకుండా యాక్టింగ్ లో కూడా ఉంటుంది అని పూరి జగన్నాథ్ అన్నాడు. తనకు అప్పులు ఉన్నాయి అని తెలిసి కూడా లైగర్ కోసం ఇచ్చిన 2 కోట్లను తిరిగి ఇచ్చేసి అప్పులు తీర్చుకో మని చెప్పాడు. ఇలాంటి హీరోలను తను చూడలేదు అని అన్నిటికి సపోర్ట్ గా ఉన్నాడు అని పూరి జగన్నాథ్ తాజాగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: