సౌత్ ఇండస్ట్రీ లో లెజెండ్రీ డైరెక్టర్ గా పేరు పొందాడు శంకర్. శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కోలీవుడ్ లో కార్తి హీరోగా నటించిన వీరుమాన్ చిత్రం ద్వారా ఈమె ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా ఈ సినిమాతో సక్సెస్ అవ్వకుంటే తన వృత్తి అయిన డాక్టర్ను కంటిన్యూ చేస్తానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే హీరోయిన్గా నటించేందుకు తండ్రిని ఎంతగానో చెప్పి ఒప్పించింది అంటూ అదితి చెప్పుకొచ్చింది తాజాగా వీరు మాన్ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ తన కూతురు హీరోయిన్గా నటించేందుకు మొదట తను ఒప్పుకోలేదని కానీ సినిమాతో మెప్పించ లేకపోతే తప్పకుండా సినిమాలకు దూరం అవుతుందని తెలియజేశారు.



వీరుమాన్ చిత్రం విడుదల అవ్వకుండానే అతిధికి  మరొక బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. హీరో శింబు కరోనా కుమార్ అనే సినిమాని రూపొందిస్తున్నారు ఈ చిత్రంలో శింబుకు జోడిగా నటింపజేయాలని మేకర్స్ అదితీని అడగగా.. ఆమె ఓకే అన్నట్లుగానే తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ చిత్రం క్యాన్సిల్ అయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కుమార్ క్యాన్సిల్ అవ్వకముందే హీరో శింబు , అదితి , శంకర్ల మధ్య కాస్త సీరియస్గా ఈ విషయం చర్చ జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శింబు తో సినిమా చేయడానికి శంకర్ అసలు ఒప్పుకోలేదట మరి హీరోతో అయినా పర్వాలేదు కానీ ఆ హీరోతో మాత్రం సినిమా చేసేందుకు తాను ఒప్పుకోనట్టు తెలియజేశారట. అయినా కూడా ఆమె సినిమాను చేస్తానంటూ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతలోనే శంకర్ కోరుకున్నట్లుగా ఆ చిత్రం ఆగిపోయిందని తమిళ సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి శంకర్ మరియు ఆయన కూతురు అతిధి మధ్య గొడవ జరుపుకోకుండానే ఈ చిత్రం ఆగిపోవడం జరిగింది. మరి ఈ విషయం పై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: