టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే  ప్రజెంట్ 'సర్కారు వారి పాట' ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.అయితే ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి.

ఇక  ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. పోతే ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే. ఇక . ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది.కాగా సినిమా కోసం ఇటీవల కేజీఎఫ్ 2 అలాగే విక్రం లాంటి బ్లాక్బస్టర్ మూవీస్ కు వర్క్ చేసిన ఫేమస్ ఫైట్ మాస్టర్ అన్బరివు సోదరులను తీసుకొనుందట చిత్రబృందం.అయితే  ఇప్పటికే వారితో డైరెక్టర్ త్రివిక్రమ్ చర్చలు కూడా సాగించాలని సమాచారం.కాగా అన్ని అనుకున్నట్లు జరిగితే వారిద్దరి త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్టులో అడుగుపెట్టనున్నారు.

ఇక తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందుకు సంబంధించి షూటింగ్ లొకేషన్ నుండి మహేష్ పిక్ కూడా ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. వీలైనంత తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: