టాలీవుడ్ ప్రముఖ కథా రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ ఓ పాన్‌ ఇండియా సినిమాకు కథ రాస్తున్నారని ఆ మధ్య మనం విన్నాం. ఓ బెంగాళీ నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని కూడా విన్నాం.తాజాగా ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించింది. ముందుగా చెప్పినట్లుగానే టాలీవుడ్‌కి చెందిన యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు '1770' అనే పేరుని పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు గురించి తెలుసుకుందాం.'1770' సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆకాశవాణి' సినిమాతో ఇప్పటికే ఆయన మంచి దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇక బంకించంద్ర ఛటర్జీ రచించిన ఆనందమఠ్‌ నవల ఆధారంగా.. ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్‌ రాశారు. శైలేంద్రకుమార్‌, సుజయ్‌ కుట్టి, కృష్ణకుమార్‌.బి ఇంకా సూరజ్‌ శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనందమఠ్‌ నవలలోని వందేమాతరం గీతం రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది.'1770'ని తెలుగుతోపాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడఇంకా బెంగాలీ భాషల్లో తెరకెక్కిస్తారు.


దీపావళి నాటికి సినిమా టీమ్‌ మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకుని, అనౌన్స్‌ చేస్తామని ప్రకటించారు. ''అన్యాయానికి వ్యతిరేకంగా జాతినంతటినీ ఏకం చేసి పోరాడేలా మన వందేమాతరం గీతం చేసింది. 1779 వ సంవత్సరంలో స్వాతంత్య్ర సమరం కోసం మొయన ప్రాంతంలో స్ఫూర్తిని రగిల్చిన యోధులెంతోమంది ఉన్నారు. ఇక వాళ్లందరి గురించి తెలియజేసే చిత్రమే ఇది'' అని రచయిత విజయేంద్రప్రసాద్‌ తెలిపారు.అశ్విన్‌ గంగరాజు రాజమౌళి దగ్గర 'ఈగ' ఇంకా 'బాహుబలి' తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజమౌళికి కాకుండా విజయేంద్రప్రసాద్‌ గతంలో ఇతరులకు కథ అందించిన 'మణికర్ణిక', 'భజరంగీ భాయిజాన్‌' ఇంకా 'మెర్సెల్‌' చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు '1770' సినిమాకు కథ అందిస్తుంటంతో ఈ సినిమాపైనా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇక ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: