త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ కాంబోలో వస్తున్న SSMB28లో పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ బాబు మాత్రం ఎక్కువగా యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని సమాచారం తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజు నాడు ఈ సినిమా మొదలవుతుందని అందరూ  కూడా అనుకున్నారు కానీ గిల్డ్ బంద్ కారణంగా అది కుదరలేదు.అందువల్ల ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే సూపర్ టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం తెలుస్తుంది.


కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమాని 2023 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది.ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం సమాచారం వినిపించింది. అసలు నిజం ఏంటంటే... ఇక విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అందులో కొన్ని గ్రే షేడ్స్ కూడా ఉంటాయి. విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ ఇంకా అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. సినిమాలో నటించడం తనకు చాలా సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసినట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన మొదటి పాన్ ఇండియా సినిమా చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: