ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మీక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  పుష్ప ది రైస్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. పుష్ప ది రైస్ మూవీ లో మలయాళం విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్  ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , సునీల్ , అనసూయ , రావు రమేష్మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ పై ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ప్రశంసల కురిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే  దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా పుష్ప ది రైస్ సినిమా క్లైమాక్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీ క్లైమాక్స్ లలో  పుష్ప ది రూల్ క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. హీరో , విలన్ కూర్చొని కామ్ గా , సైలెంట్ గా మాట్లాడుకుంటారు. కొత్తగా అనిపించింది. ఎలాంటి ఫైట్ లేదు అని పూరి జగన్నాథ్ చెప్పాడు. అలాగే తాజాగా పూరి జగన్నాథ్ లైగర్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే.

పూరి జగన్నాథ్ 'లైగర్' మూవీ లో కూడా విజయ్ దేవరకొండ కి మరియు మైక్ టైసన్ కి మధ్య వచ్చే సన్నివేశం చాలా కొత్తగా ఉంటుంది.  ఇలాంటి సన్నివేశం ఏ సినిమాలో కూడా లేదు అని పూరి జగన్నాథ్ చెప్పు కొచ్చాడు. పూరి జగన్నాథ్ తాజాగా దర్శకత్వం వహించిన లైగర్ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగస్ట్ 25 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: