టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్ ఎస్ రాజమౌళి రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో ఏదైనా సినిమా కనుక తెరకెక్కితే ఆ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకోవాల్సిందేనని అందరూ భావిస్తారు.ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో పాటు అవార్డులు కూడా సాధించాలని కోరుకుంటున్నారు.ఈ దిశగా జక్కన్న రాజమౌళి అడుగులు వేస్తుండటం గమనార్హం. ఈ రెండు విషయాలలో అస్సలు తగ్గకూడదని రాజమౌళి భావిస్తున్నారని సమాచారం.వేగంగా సినిమాలను తెరకెక్కించడం కంటే నిదానంగా సినిమా తెరకెక్కించి ఆ సినిమా సక్సెస్ సాధించాలని రాజమౌళి భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబో సినిమా కథ, కథనానికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయని సమాచారం. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తవుతుందని సమాచారం తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. 2023 సంవత్సరం జూన్ లేదా జులై నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.


బాహుబలి2 ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాలను మించేలా ఈ సినిమా ఉండాలని జక్కన్న భావిస్తున్నారు. బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఇంకా లాభాల రూపంలో భారీ మొత్తంలో తీసుకుంటున్నారని సమాచారం తెలుస్తోంది.రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తం 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. సూపర్ స్టార్ మహేష్ కు జోడీగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ను జక్కన్న ఎంపిక చేయనున్నారని సమాచారం తెలుస్తోంది.మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: