తెలుగు తేజం పీవీ సింధు.. భారత షట్లర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తన ఆటతీరుతో అభిమానుల మనసులు గెలుచుకుంది. ఇక కోర్టులోకి అడుగుపెట్టిన తర్వాత ఎంతో సీరియస్గా ఆట మీద ఏకాగ్రత పెట్టే సింధూ బయట మాత్రం ఎంత చలాకీతనంతో సరదాగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా ఏకంగా స్వర్ణ పతకం సాధించింది పీవీ సింధు. దీంతో ఇక ప్రపంచవ్యాప్తంగా పీవీ సింధు పై ప్రశంసలు కురిపించారు అందరూ.


 ఇకపోతే ఇటీవల బుల్లితెర పై ప్రసారమయ్యే ఒక కార్యక్రమంలో పీవీ సింధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది అని చెప్పాలి. సాధారణంగా అంతర్జాతీయ వేదికలపై ఇప్పటివరకు పీవీ సింధు ఎన్నోసార్లు మాట్లాడింది. కానీ ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడుతూ వచ్చేది. ఈక్రమంలోనే తెలుగు తేజం పీవీ సింధు సరిగ్గా తెలుగు మాట్లాడగలదా అనే అనుమానం కూడా ఎంతోమంది లో ఉంది అని చెప్పాలి. కానీ ఇటీవలే మాత్రం ఎంతో అనర్గళంగా పీవీ సింధు తెలుగు మాట్లాడటంతో ఇది చూసిన ప్రేక్షకులు అందరూ కూడా మమర్చిపోయారు అని చెప్పాలి.



  ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది పీవీ సింధూ. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే పాల్గొన్నారు. కానీ మొదటిసారి ఒక క్రీడాకారిణి అది మన తెలుగు తేజం పీవీ సింధు పాల్గొనడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆలీ ఎప్పటిలాగానే ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు వేసి ఆసక్తిగల సమాధానాలను రాబట్టాడు. అయితే స్టార్ ప్లేయర్ అయిన పి.వి.సింధు ఎక్కడ అతి చేయకుండా అచ్చ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకర్షించింది. తాను ఎప్పుడూ మాట్లాడే ఇంగ్లీషును పక్కనబెట్టి తన మాతృభాష అయిన తెలుగులో నే  సంభాషించింది. ఇది చూసిన ప్రేక్షకులు పీవీ సింధు తెలుగు మాట్లాడుతుంటే చూడముచ్చటగా ఉంది అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: