పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే . ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ మూవీ తో పాటె పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ని కూడా ప్రారంభించాడు . కాక పోతే కొన్ని కారణాల వల్ల ఈ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత నిలిచి పోయింది .

మళ్లీ కొన్ని రోజుల క్రితమే తిరిగి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది . కాక పోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పై దృష్టి పెట్టడం తో ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆగి పోయింది . ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా , నిధి అగర్వాల్మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది . పవన్ కళ్యాణ్మూవీ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వం లో భవదీయుడు భగత్ సింగ్ మూవీ కి కూడా కమిట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే .

అలాగే తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతం అనే సినిమాను కూడా పవన్ కళ్యాణ్ తెలుగు లో రీమేక్ చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు  మార్చే పనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పనులు అన్ని ముగియగానే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: