టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాగ శౌర్య 'ఛలో' మూవీ తో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు . నాగ శౌర్య కొంత కాలం క్రితమే వరుడు కావలెను , లక్ష్య మూవీ లతో వరుసగా ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయాయి. ఇది ఇలా ఉంటే వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నాగ శౌర్య తాజాగా తన కొత్త మూవీ ను ప్రారంభించాడు. ఈ మూవీ కి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. 

మూవీ తో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టబోతున్నాడు. తాజాగా హైదరాబాద్‌ లోని ప్రొడక్షన్‌ ఆఫీస్‌ లో ఈ మూవీ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తం షాట్‌ కు దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్‌ బోర్డ్‌ కొట్టి స్క్రిప్ట్‌ ను అందజేశారు. నాని 'దసరా' మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తుంది.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ మూవీ ని భారీ బడ్జెట్‌ తో నిర్మించనుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరి కొన్ని ప్రారంభం కానుంది. ఈ మూవీ లో నాగ శౌర్య కు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. పవన్ సీహెచ్  ఈ మూవీ కి సంగీతాన్ని అందించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: