టాలీవుడ్ లో లేటెస్ట్ గా స్పెషల్ షోస్ ట్రెండ్ అనేది మొదలైంది..మన టాప్ హీరోల సినిమాలలో సంచలన విజయాలుగా నిలిచినా కొన్ని మూవీస్ ని సదరు హీరో పుట్టిన రోజు నాడు స్పెషల్ షోస్ వేయించడం గత ఏడాది నుండి కూడా ఆనవాయితీగా వస్తుంది..గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు గబ్బర్ సింగ్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 15 షోస్ కి పైగా వేసుకున్నారు..ఇది చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈ ఏడాది పోకిరి సినిమాని రీ మాస్టర్ చేయించి మరీ చరిత్రలో కనివిని ఎరుగని రేంజ్ లో ఏకంగా 370 షోస్ వేసుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు..ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోస్ ద్వారా దాదాపుగా 1 కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇది ఖచ్చితంగా ఒక వరల్డ్ ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ సృష్టించిన ఈ అరుదైన రికార్డు ని ఎవరు బ్రేక్ చేస్తారు అని అనుకుంటున్న సమయం లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చింది.ఇక చిరంజీవి  పుట్టిన రోజు సందర్భంగా మెగా ఫాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘరానా మొగుడు మూవీ స్పెషల్ షోస్ వేసుకున్నారు.


ఇక ఘరానా మొగుడు చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ మరీ పాత సినిమా అవ్వడం తో ఈ జనరేషన్ యూత్ పెద్దగా ఆసక్తి అనేది చూపించలేదు..కొన్ని ప్రధాన ప్రాంతాలలో హౌస్ ఫుల్స్ అయితే పడ్డాయి కానీ..క్రింద ప్రాంతాలలో ఒక్క చోట కూడా అసలు హౌస్ ఫుల్ రాలేదు..ఘరానా మొగుడు సినిమా బదులు ఇంద్ర సినిమా కనుక వేసి ఉంటె కచ్చితంగా పోకిరి రికార్డు బద్దలు కొట్టేవాళ్లమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..వాస్తవానికి ఇంద్ర సినిమా ప్రింట్ కోసం మెగా ఫాన్స్ చాలా రకాల ప్రయత్నాలే చేసారు..కానీ వైజయంతి మూవీస్ వారు ‘ఇంద్ర సినిమాని కచ్చితంగా 4k కి మార్చి విడుదల చేస్తాము అయితే ఇప్పుడు మాత్రం కాదు..త్వరలో వైజయంతి మూవీస్ బ్యానర్ 50 వ వార్షికోత్సవం ఘనంగా ఈ సినిమా నిర్వహించబోతున్నామని అన్నారు.


అందువల్ల ఇక మెగా అభిమానులు ఈ ఏడాదికి ఘరానా మొగుడు సినిమాని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది..పోకిరి సినిమా స్పెషల్ షోస్ కి దాదాపుగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే ఘరానా మొగుడు సినిమాకి మాత్రం కేవలం 20 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చిందంటూ ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త..అంటే పండుగాడి పోకిరి సినిమా మేనియా ని ఘరానా మొగుడు కనీసం కూడా మ్యాచ్ చెయ్యలేకపోయింది అని చెప్పొచ్చు..అయితే ఇప్పుడు పోకిరి సినిమా మేనియా ని బీట్ చెయ్యగల సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని..సెప్టెంబర్ 2 వ తేదీన జల్సా స్పెషల్ షోస్ ద్వారా పోకిరి సినిమా రికార్డ్స్ ని బద్దలు కోడతామని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా సవాలు విసిరారు.మరి చూడాలి పోకిరి రికార్డుని బద్దలు కొడతారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: