పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో.. భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈయన మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే మరొక బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత ప్రాజెక్టులు కూడా అదే పాన్ ఇండియా లెవెల్ లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో రామాయణ  ఇతిహాస కథ ఆధారంగా రూపొందుతున్న ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నాడు . ఇక రూ.500 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా జపనీస్ మూవీ రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ స్ఫూర్తితో త్రీడి ఫార్మాట్లో రూపొందించబోతున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ఇందులో హీరోయిన్ గా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఆది పురుష్ సినిమా తర్వాత ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది ఇక ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . ఇదే సమయంలోనే నాగ అశ్విన్ డైరెక్షన్లో టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్గా రూపొందుతున్న ప్రాజెక్టు కే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రాజెక్టు కూడా రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో వైజయంతి మూవీస్ అధినేత సి అశ్విని దత్ నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్. ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా వచ్చే జూన్ నుంచి షూటింగ్ మొదలు కాబోతుందట. మరి ఇందులో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు .. ఏ నిర్మాణ సంస్థ నిర్మించే అవకాశం ఉంది అనే వివరాలు త్వరలోనే బయటకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: