కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న తళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తళపతి విజయ్ తాను నటించిన అనేక సినిమాలను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితమే తలపతి విజయ్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయిన బీస్ట్ సినిమా పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తలపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ లో వరిసు అనే పేరుతో తెరకెక్కుతుండగా ,  తెలుగు లో వారసుడు అనే పేరుతో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వాటిని ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పూర్తి అవగానే తలపతి విజయ్, లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ దళపతి విజయ్ కెరియర్ లో 67 వ సినిమాగా తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మూవీ లో త్రిష తలపతి విజయ్ భార్య పాత్రలో నటించబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: