టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ రేపు అనగా ఆగస్ట్ 25 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తో పాటు కన్నడ , మలయాళ , హిందీ , తమిళ భాషల్లో విడుదల కాబోతుంది . ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా , మైక్ టైసన్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్ర లో నటించాడు . 

మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్ర లో రమ్యకృష్ణ నటించింది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ దర్శకులలో ఒకరైన సుకుమార్ , విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ , సుకుమార్ కాంబినేషన్ లో సినిమా 2024 జనవరి నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న పుష్ప పార్ట్ 2 మూవీ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నర్వణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: