సినీ ఇండస్ట్రీలో ఎంతటి సెలబ్రెటీ అయినా సరే ట్రోలింగ్ ఎదుర్కోక తప్పదని చెప్పవచ్చు.. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంలో ట్రోలింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు.. ఈ విషయంలో అమితాబచ్చన్ ని సైతం విడిచిపెట్టలేదు ఆయన ట్రోలర్స్.. ఇక మిగిలిన నటీనటుల సైతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఏదో ఒక విషయంలో వీరందరూ ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఈ ట్రోలింగ్ ని ఎవరు ఎలా తీసుకుంటారో అన్నది వారి డిపెండ్ పైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఇలాంటివి అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటారు మరి కొంతమంది మనస్థాపానికి గురై ఎన్నో రోజులు తర్వాత చేరుకుంటూ ఉంటారు.


ఇక కొంతమంది హీరోయిన్లు సైతం సందర్భాన్ని బట్టి ట్రోలింగ్ లకి బదులిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇవే ప్రశ్నలు హీరోయిన్ అనన్య పాండే  ముందుకు రావడం జరిగింది.ట్రోలింగ్ బారిన పడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ? అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.. అప్పుడు అనన్య పాండే.. మాట్లాడుతూ అది ఆరోజు పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అని తెలియజేసింది. సహజంగా కొన్ని రోజులపాటు ఆ ప్రభావం తన మీద ఉంటుంద అని ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ని మర్చిపోతానని తెలిపింది.


అయితే ఇలాంటివి సాధారణంగా అందరి విషయంలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా జరుగుతాయని చెప్పవచ్చు. ప్రజలు అనన్య పాండే గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక అనన్య పాండే ఎప్పుడు కూడా ఎలాంటి హడావిడి లో ఉండనని నన్ను నేను నిరూపించుకోవాలని నటిగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటానని తెలిపింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లైగర్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఈ రోజున గ్రాండ్గా విడుదల అయింది. మరి చిత్రంతో సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: