ఇక కొంతమంది హీరోయిన్లు సైతం సందర్భాన్ని బట్టి ట్రోలింగ్ లకి బదులిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇవే ప్రశ్నలు హీరోయిన్ అనన్య పాండే ముందుకు రావడం జరిగింది.ట్రోలింగ్ బారిన పడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ? అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.. అప్పుడు అనన్య పాండే.. మాట్లాడుతూ అది ఆరోజు పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అని తెలియజేసింది. సహజంగా కొన్ని రోజులపాటు ఆ ప్రభావం తన మీద ఉంటుంద అని ఆ తర్వాత కొన్ని రోజులకు అన్ని మర్చిపోతానని తెలిపింది.
అయితే ఇలాంటివి సాధారణంగా అందరి విషయంలో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా జరుగుతాయని చెప్పవచ్చు. ప్రజలు అనన్య పాండే గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక అనన్య పాండే ఎప్పుడు కూడా ఎలాంటి హడావిడి లో ఉండనని నన్ను నేను నిరూపించుకోవాలని నటిగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటానని తెలిపింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లైగర్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఈ రోజున గ్రాండ్గా విడుదల అయింది. మరి చిత్రంతో సక్సెస్ అవుతుందేమో చూడాలి.