టాలీవుడ్ యువ హీరోలలో ఒకరైన పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో బుచ్చిబాబు దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఉప్పెన మూవీ వంద కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వైష్ణవ్ తేజ్ 'కొండపొలం' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలను పొందింది. ఇది ఇలా ఉంటే వైష్ణవ్ తేజ్ తన కెరియర్ లో మూడవ సినిమాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో నటించాడు.  

ఈ సినిమాకు గిరిశయ్య దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 4.85 మిలియన్ వ్యూస్ ను ,  94.9 కే లైక్ లను సాధించి ఓవరాల్ గా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: