అలనాటి కాలంలో ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వంటి స్టార్ హీరో లతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో లలో ఒకరు అయిన రాజ శేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .

అలనాటి కాలంలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొనసాగిన రాజ శేఖర్ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేక పోయాడు . అలాంటి సమయం లోనే రాజ శేఖర్ టాలీవుడ్ యంగ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో పెరకెక్కిన గరుడ వేగ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు .   రాజ శేఖర్ 'గరుడ వేగ' మూవీ తర్వాత కల్కి , శేఖర్ వంటి మూవీ లలో హీరో గా నటించాడు .

మంచి అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయాయి . ఇది ఇలా ఉంటే రాజ శేఖర్ హీరో గా సురక్ష ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థ ఓ మూవీ ని రూపొందిస్తుంది . ఈ మూవీ కి పవన్ సాదినేని దర్శకుడు గా వ్యవహరిస్తున్నాడు . తాజాగా ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేసింది . ఈ మూవీకి మాన్ స్టర్ అనే టైటిల్ ని మూవీ యూనిట్ ఖరారు చేసింది . తొలి సన్నివేశానికి ప్రవీణ్ సత్తార్ క్లాప్ ఇచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తాము అని దర్శకుడు పవన్ సాదినేని తెలియ జేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: