పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అజ్ఞాత వాసి మూవీ తర్వాత పూర్తిగా రాజకీయాలకు సమయాన్ని కేటాయించే ఉద్దేశంతో కొంత కాలం పాటు మూవీ లకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే . అలా కొంత కాలం పాటు మూవీ లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోరిక మేరకు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు .

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వకీల్ సబ్ , భీమ్లా నాయక్ మూవీ లలో హీరోగా నటించాడు . ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్టోబర్ నెల నుండి మళ్లీ సుదీర్ఘ రాజకీయ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అలా ఆ సుదీర్ఘ పర్యటనకు ముందే పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుండి తమిళ సినిమా వినోదయ సీతం రీమేక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే పవన్ కళ్యాణ్మూవీ షూటింగ్ కోసం కేవలం 20 నుండి 25 రోజులు మాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించనుండగా , ఒరిజినల్ తమిళ సినిమా వినోదయ సీతం మూవీ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖనిరీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మూవీ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: