ఈటీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ సౌత్ లోనే బిగ్గెస్ట్ డాన్స్ షో గా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంతో మంది డాన్స్ మాస్టర్ లను  అందించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డాన్స్ మాస్టర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ లాంటి వారు ఒకప్పుడు ఢీ లో కంటెస్టెంట్ గా చేసి ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా అవతారం ఎత్తిన వారే. ఇక దాదాపు 13 సీజన్ ల నుంచి కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు 14 వ సీజన్ నడుస్తోంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవలి కాలంలో అటు ఢీ షో లో భాగంగా మెంటార్స్ మారుతూ వున్నారు. గతంలో సుధీర్ రష్మి మెంటర్స్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం హైపర్ ఆది, అఖిల్   వారు ఢీ షో లో టీం లీడర్ గా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. బిగ్బాస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ చివరికి ఢీ 14వ సీజన్లో అవకాశం దక్కించుకున్నాడు. ఇక హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ లో సూపర్ పాపులారిటీ సంపాదించుకునీ ఇక ఇప్పుడు ఢీ షో లో సందడి చేస్తున్నాడు. బిగ్బాస్ ఓటిటి  కారణంగా ఢీ షో కి దూరమైన అఖిల్ ఇక ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢీ షో లో హైపర్ ఆది, అఖిల్  తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది ఢీ షో కోసం ఏకంగా జడ్జ్ లతో సమానంగా పారితోషికం   తీసుకుంటున్నాడట. ఒక కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నాడట. కానీ అటు అఖిల్ కు మాత్రం చాలా తక్కువ అని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వారానికి రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అఖిల్  ఇప్పుడు ఒక కాల్ షీట్ కు కేవలం లక్షన్నర  మాత్రమే తీసుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: