కన్నడలో యాక్షన్ హీరోగా పేరుపొందిన చిరంజీవి సజ్జ ఆకస్మిక మరణంతో మానసికంగా చాలా కృంగిపోయింది ఆయన భార్య.. నటి మేఘనా రాజ్. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి ఈమె కోలుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నది. అంతేకాకుండా నటిగా మళ్లీ తన కెరియర్ పైన దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నది. అలా సినిమాలతో పాటు పలు టీవీ షోలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే మేఘన రెండవ వివాహం చేసుకోబోతోంది అంటూ గత కొంతకాలంగా పలు వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. అయితే అలాంటి వార్తలకు చెక్ పెట్టే విధంగా ఈమె ఒక సాహసం చేసింది వాటి గురించి చూద్దాం.


తన భర్త చిరంజీవి సర్జా.. నా కొడుకు రాయన్ పేర్లను.. తన చేతి పైన ట్యాటూగా వేయించుకుంది. వారు ఎప్పటికీ తన గుండెలోని ఉండిపోతారని వాటికి సంబంధించిన ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఒక సినిమా షూటింగ్లో మొదటిసారి కలుసుకున్న చిరంజీవి సర్జ, మేఘనారాజ్  ఒకటవ్వడంతో పదేళ్లపాటు ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతోనే 2018 మే-2 వ తేదీన వివాహం చేసుకున్నారు.వీరి ప్రేమ బంధానికి ప్రతీక గాఒక పండంటి బిడ్డకు కూడా జన్మ నిచ్చింది. మేఘన గర్భం దాల్చిన కొన్ని నెలలకి చిరంజీవి సర్జా 2020 జూన్ -7 వ తేదీన గుండెపోటుతో మరణించారు దీంతో తన భర్త జ్ఞాపకాలతోనే ఆమె జీవిస్తూ ఇంటికే పరిమితమైంది. అయితే అదే ఏడాది రాయన్ రాజ్ సర్జ పుట్టడంతో మళ్ళీ ఆమె జీవితం పైన ఆశలు పెంచుకుంది తన భర్త ప్రతిరూపమై తన కుమారుడు ఆలన పాలన చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తోంది. అయితే ఈమె తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన బెండ్ అప్పారావు సినిమాలతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో కొన్ని సినిమాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: