కొన్ని సంవత్సరాల క్రితం చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అప్పట్లో కార్తికేయ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో దక్కాయి. అలాగే ఈ సినిమా నిఖిల్ కు చందు మండేటి కీ అద్భుతమైన గుర్తింపు ను తీసుకువచ్చింది.

ఇలా కార్తికేయ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ గా దర్శకుడు చందు మండేటి కార్తికేయ 2 మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి జ్ వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని ఆగస్టు 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడం అలాగే కార్తికేయ 2 మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కార్తికేయ 2 మూవీ 12.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని , 13.30 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటివరకు 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని  కంప్లీట్ చేసుకుంది. ఈ 15 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 43.65 కోట్ల షేర్ , 85.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో కార్తికేయ 2 మూవీ 30.35 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: