తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఉప్పెన మూవీ బాక్సా ఫీస్ దగ్గర కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. 

ఇలా ఉప్పెన మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. మొదటి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో రెండవ మూవీ తో మాత్రం కమర్షియల్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. కాక పోతే కొండపొలం మూవీ లో వైష్ణవ్ తేజ్ నటన తో ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించాడు. తాజాగా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా గిరిశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి ఒక అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ సెమీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఈరోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, భీమవరం లో నిర్వహించనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: