మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వాటిలో ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచగా తప్పకుండా ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి అభిమానులను సంతృప్తి పరుస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు.దసరా కానుకగా ఈ సినిమా ను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మరొక సినిమా భోలా శంకర్ వచ్చే యేడాది వేసవి కానుక విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని ఇంత దూరం పోస్ట్ పోన్ చేయడం అందరికీ ఒక్కసారిగా నిరాశపరిచింది. దానికి కారణం లేకపోలేదట. ఆయన ఇప్పుడు చేస్తున్న బాబీ దర్శకత్వంలోని సినిమాను గాడ్ ఫాదర్ చిత్రం తరువాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన ఆలోచిస్తున్నారట. దాంతో బోలా శంకర్ సినిమాను వెనక్కి జరపడంలో పెద్ద ఆసక్తికరమైన ఆశ్చర్యమేమీ లేదని మెగా కాంపౌండ్ చెపుతుంది.

 ఏదేమైనా ఈ మూడు మాస్ మసాలా సినిమాలతో అలరించడానికి మెగాస్టార్ చిరంజీవి ఇంత తక్కువ వ్యవధిని నిర్ణయించడం అందరిని ఎంతగానో సంతోష పరుస్తుంది. అయన గత సినిమా ఆచార్య సినిమాతో భారీ స్థాయిలో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో ఈ సినిమాలతో విజయాలు అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మరి పడిలేవడం అనేది చిరంజీవి కి కొత్త కాదు ఈ నేపథ్యంలో ఈ సినిమాలతో ఆయన ఏవిధంగా ప్రేక్షకులను అలరించే సినిమాలను చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా ల తర్వాత అయన కొంతమంది అగ్ర దర్శకులతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి వారితో సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: