ఇటీవలే ఆసియా కప్లో భాగంగా యూఏఈ వేదికగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ ఎప్పటిలాగానే హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోయింది. నువ్వానేనా అన్నట్లుగా ఎంతో ఉత్కంఠ భరితమైన పోరు జరిగింది. చివరి బంతి వరకు కూడా ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో మంది క్రికెట్ అభిమానులు అటు నేరుగా స్టేడియం కి వెళ్లి మ్యాచ్ వీక్షించారు. కొంత మంది ప్రేక్షకులు టీవీల ముందు కూర్చుని ఫ్యామిలీతో మ్యాచ్ ను ఎంతగానో ఎంజాయ్ చేశారు అని చెప్పాలి.


 అయితే ఇలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఎవరైనా సినిమా సెలబ్రిటీలు కనిపిస్తే అది కాస్త  హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కనిపించాడు. దీంతో ఇండియన్ క్రికెట్ ఫాన్స్ అందరు కూడా సర్ప్రైస్ అయ్యారు అని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ కనిపించడంతో ఎన్నో కెమెరాలు విజయ్ దేవరకొండ వైపు వెళ్ళాయి. కేవలం స్టేడియంలో ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయడమే కాదు కామెంట్రీ బాక్స్ లో ఉన్న అందరితో కూడా కాసేపు ముచ్చటించాడు రౌడీ హీరో.


 ఈ సందర్భంగా కామెంటెటర్లు  అడిగిన ఒక ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే లైగర్ అనే సినిమాతో బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న ఒక స్పోర్ట్స్ సినిమా చేశారు. ఇక రానున్న రోజుల్లో క్రికెట్ నేపథ్యంలో ఏదైనా సినిమా చేస్తారా అని అడగగా.. ఇప్పటికే అన్ని తీసేశారు. ధోని బయో పిక్ కూడా వచ్చింది.  ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం విరాట్ కోహ్లీ బయోపిక్ మిగిలి ఉంది కాబట్టి ఆయన బయోపిక్ లో నటించాలని కోరుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పాడు. ఇది విని అభిమానులు కోహ్లీ బయోపిక్ లో విజయ్ దేవరకొండ ఇదో క్రేజీ కాంబినేషన్ అంటూ అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: