రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అతను ఎంతో ఆనందంగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఉండటం చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.  ఇంతకీ ఏం జరిగింది అని అంటారా.. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకువచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా కోసం అటు విజయ్ దేవరకొండ కూడా బాగానే కష్టపడ్డాడు. ఎన్నో రోజుల పాటు జిమ్లో కసరత్తులు చేసి  సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.


 ఇక పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు అన్ని భాషల్లో కూడా విడుదల చేశారు అని చెప్పాలి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకున్నాడు.  కానీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతలకు కష్టాలు తప్పవని అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ కావడంతో నిరాశలో ఉంటాడని అందరూ అనుకున్నారు.


 కానీ అందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పాలి. ఇటీవలే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ లైవ్ లో వీక్షించడానికి దుబాయ్ కి వెళ్ళాడు విజయ్ దేవరకొండ. అక్కడ ఇక మ్యాచ్ చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశాడు అనే చెప్పాలి. ఇక విజయ్ తో పాటు క్రికెటర్లు జతిన్ సర్ఫ్, ఇర్ఫాన్ పఠాన్  కూడా సందడి చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. నాకు ఎనర్జీ చాలా ఎక్కువ.. ఈ రోజు కోహ్లీ కనీసం 50 పరుగులు చేస్తాడని ఆశాభావంతో ఉన్నాను. 20 పరుగులు దాటితే ఆ మార్క్ దాటగలడు..  కోహ్లీ 100వ  మ్యాచ్ ను చూడకుండా ఉండలేకపోతున్నా అంటూ తెలిపాడు విజయ్ దేవరకొండ. ఇది చూసిన ప్రేక్షకులు లైగర్ సినిమా పోయిందన్న బాధ విజయ్ లో ఎక్కడా కనిపించడం లేదే అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: