ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత కొండపోలం అనే ఒక వైవిధ్యమైన మూవీ లో హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.  

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ దర్శకుడు గిరిశయ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా గిరిశయ్య , వైష్ణవ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో గిరిశయ్య మాట్లాడుతూ ... మూవీ ని చేసేటప్పుడు వైష్ణవ్ తేజ్ చాలా కంఫర్ట్ ని ఇచ్చే వాడని , ఏ సన్నివేశాన్ని అయినా కూడా ముందు నేను చెప్పాక ఒక సారి తనని చేసి చూపించమంటాడు.  ఆ తర్వాత నేను వివరించాక ఇక అంతే అది మైండ్ లో తనకి ఫ్రీజ్ అయ్యి పోతుంది. దాంతో సింగిల్ టేక్ లో ఆ సన్నివేశాన్ని వైష్ణవి తేజ్ తాను చేసేస్తాడని తాజా ఇంటర్వ్యూలో భాగంగా గిరిశయ్య చెప్పు కొచ్చాడు. మరి రంగ రంగ వైభవంగా మూవీ తో పంజా వైష్ణవ్ తేజ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: