పుల్కార్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం సినిమా ఆగస్టు 5 వ తేదీన విడుదల భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికి కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న సీతా రామం మూవీ గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 

సోషల్ మీడియా వేదికగా సీతా రామం మూవీ గురించి చిరంజీవి స్పందిస్తూ ... సీతా రామం మూవీ ని చూశాను. ఒక మంచి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి. మరియు ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లే తో ఈ ప్రేమ కథను ఆవిష్కరించిన విధానం కూడా ఎంత గానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి మూవీ ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్విని దత్ గారికి సప్న దత్ లకు , ప్రియాంక దత్ లకు ఒక ఫ్యాషన్ తో ఈ మూవీ ని చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడి కి  కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి అన్నింటికన్నా ముఖ్యంగా సీతా రామ్ లుగా ఈ ప్రేమ కథ కి  ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్ కి దుల్కర్ సల్మాన్ లకు సూత్రధారి పాత్రను పోషించిన రష్మిక మందన కు మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు.  

ప్రేక్షకుల మనసులు దోచిన ఈ సినిమా మరెన్నో అవార్డులను , రివార్డులను జాతీయస్థాయిలో గెలవాలని మనస్పూర్తిగా అభిలాసిస్తున్నాను అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సీతా రామం మూవీ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: