టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఈ యువ హీరో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన వైదిధ్యమైన చిత్రం కొండపొలం మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ తన కెరియర్ లో మూడవ సినిమాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో నటించాడు. ఈ మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా , గిరిశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా వైష్ణవ్ తేజ్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ... గిరిశయ్య ఈ మూవీ కథను చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక ఎంటర్టయినర్ రాలేదనిపించింది. ఈ మూవీ లో నా క్యారెక్టర్ పేరు రుషి .. హీరోయిన్ పాత్ర పేరు రాధ. ఈ రెండు పాత్రల మధ్య కూడా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్య ఉండే గిల్లి కజ్జాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాయి. సెట్లో నేను సైలెంట్ గా ఉంటాను గానీ, కేతిక శర్మ మాత్రం రాధ మాదిరి గానే చాలా అల్లరి చేస్తుంది. అందువలన ఆమెకి తగిన పాత్రనే దొరికింది అని పంజాబ్ వైష్ణవి తేజ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: